India Follow On: ఫాలోఆన్ గడ్డం తప్పించిన జస్ప్రీత్ బుమ్రా-ఆకాశ్ దీప్ జోడి
- ఫాలోఆన్ తప్పించుకున్న టీమిండియా
- జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 33 పరుగులు చేసి అజేయంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇప్పుడు మ్యాచ్ డ్రా చేసే అవకాశం ఎక్కువుగా కనపడుతుంది.
Also Read: IND vs AUS: ముగిసిన నాలుగో రోజు ఆట.. ఫాలో ఆన్ గండం తప్పించుకున్న టీమిండియా
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Kohli reaction after Akashdeep hitting Six 😂🔥🫡#INDvsAUS #viral #ViratKohli𓃵 #Bumrah #akashdeep #RohitSharma𓃵 pic.twitter.com/XklWjkW9eh
— vk18 (@king19mahadev) December 17, 2024
ఇకపోతే జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 33 పరుగులు జోడించి ఫాలో ఆన్ ముప్పును తప్పించారు. ప్రస్తుతం క్రీజులో జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో, ఆకాశ్ దీప్ 27 పరుగులతో ఉన్నారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల అర్ధ సెంచరీల ఆధారంగా ఈ మ్యాచ్లో ఫాలో-ఆన్ను కాపాడుకోవడంలో భారత్ విజయం సాధించింది. 66వ ఓవర్లో రవీంద్ర జడేజా ఔటవడంతో టీమిండియా ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేక పోయినట్లే అనిపించింది. అయితే బుమ్రా, ఆకాశ్దీప్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆటగాళ్లిద్దరూ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశారు. కమిన్స్ వేసిన బంతికి బుమ్రా అద్భుతమైన సిక్సర్ కొట్టగా, ఆకాశ్దీప్ కూడా స్వేచ్ఛగా స్ట్రోక్స్ ఆడాడు. రోజు ఆట ముగిసే సమయానికి ఆకాశ్దీప్ 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 27 పరుగులు చేశాడు. మరోవైపు బుమ్రా కూడా ఒక సిక్సర్ సహాయంతో 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం టీమిండియాకు కీలకంగా మారింది.
Also Read: One Nation One Election: జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై లోక్సభలో ఓటింగ్..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?