India Follow On: ఫాలోఆన్ గడ్డం తప్పించిన జస్ప్రీత్ బుమ్రా-ఆకాశ్ దీప్ జోడి
- ఫాలోఆన్ తప్పించుకున్న టీమిండియా
- జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 33 పరుగులు చేసి అజేయంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇప్పుడు మ్యాచ్ డ్రా చేసే అవకాశం ఎక్కువుగా కనపడుతుంది.
Also Read: IND vs AUS: ముగిసిన నాలుగో రోజు ఆట.. ఫాలో ఆన్ గండం తప్పించుకున్న టీమిండియా
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
Kohli reaction after Akashdeep hitting Six 😂🔥🫡#INDvsAUS #viral #ViratKohli𓃵 #Bumrah #akashdeep #RohitSharma𓃵 pic.twitter.com/XklWjkW9eh
— vk18 (@king19mahadev) December 17, 2024
ఇకపోతే జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 33 పరుగులు జోడించి ఫాలో ఆన్ ముప్పును తప్పించారు. ప్రస్తుతం క్రీజులో జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో, ఆకాశ్ దీప్ 27 పరుగులతో ఉన్నారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల అర్ధ సెంచరీల ఆధారంగా ఈ మ్యాచ్లో ఫాలో-ఆన్ను కాపాడుకోవడంలో భారత్ విజయం సాధించింది. 66వ ఓవర్లో రవీంద్ర జడేజా ఔటవడంతో టీమిండియా ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేక పోయినట్లే అనిపించింది. అయితే బుమ్రా, ఆకాశ్దీప్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆటగాళ్లిద్దరూ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశారు. కమిన్స్ వేసిన బంతికి బుమ్రా అద్భుతమైన సిక్సర్ కొట్టగా, ఆకాశ్దీప్ కూడా స్వేచ్ఛగా స్ట్రోక్స్ ఆడాడు. రోజు ఆట ముగిసే సమయానికి ఆకాశ్దీప్ 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 27 పరుగులు చేశాడు. మరోవైపు బుమ్రా కూడా ఒక సిక్సర్ సహాయంతో 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం టీమిండియాకు కీలకంగా మారింది.
Also Read: One Nation One Election: జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై లోక్సభలో ఓటింగ్..
తాజావార్తలు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?