Kirana Hills: భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో ఇప్పుడు ఓ విషయం సంచలనంగా మారింది. పాకిస్తాన్లోని సర్గోదా సమీపంలో ఉన్న ‘‘కిరాణా కొండలు’’ సంచలనంగా మారాయి. సోమవారం త్రివిధ దళాల అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా కిరాణా కొండల ప్రస్తావన వచ్చింది. భారత్ పాక్ కిరాణా కొండలపై దాడి చేసిందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, అసలేంటి ఈ కిరాణా కొండలు, అంత ప్రాముఖ్యత ఏంటనే అనుమానాలను రేకెత్తించింది.