ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు.
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి..
దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక 'శత్రువు దేశం'గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.
Kim Jong Un: వరస మిస్సైల్ టెస్టులు, గూఢాచర ఉపగ్రహాల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. జపాన్, దక్షిణకొరియా, యూఎస్ వార్నింగులను ఖాతరు చేయడం లేదు ఉత్తర కొరియా నియంత. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మిస్సైల్ లాంచర్ల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొత్త వ్యూహాన్ని అనుసరించారు. అమెరికా ఎత్తుగడలను అడ్డుకునేందుకు యుద్ధ సన్నాహాలను పెంచాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. అమెరికా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి లగ్జరీ కార్లు అంటే విపరీతమైన మోజు. అయితే ఆ దేశ అణు కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర కొరియాపైన ప్రపంచంలో చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి లగ్జరీ వస్తువులు చేరాలంటే అక్రమ రవాణానే మార్గం. దేశంలో ప్రజలు తినడానికి తిండి లేనప్పటికీ.. కిమ్కి మాత్రం ఫారెన్ మందు, స్విట్జర్లాండ్ చీజ్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వీటిలో పాటు విలువైన కార్లను స్మగ్లింగ్…