ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రజాసేవనే ప్రజలు గుర్తుంచుకుంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, సౌమ్యుడైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాదిరిగా కొంత కఠినంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత తాతా మధుసూదన్ అన్నారు. స్థానిక సంస్థల…
ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదని ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా…
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక…
ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఓ నవజాత శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యునిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండా కు చెందిన నిండు గర్భిణీని ప్రసూతి నిమిత్తం తొలుత జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో…
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి…
పోలింగ్ జరిగిన ఆరుచోట్లా ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ కైవశం చేసుకున్నా.. ఆ జిల్లాలో మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్నిక ఏదైనా అక్కడ వెన్నుపోట్లు తప్పదా..? భారీగా క్రాస్ ఓటింగ్కు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ సూత్రధారి ఎవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు చెందిన తాతా మధు గెలిచారు. పార్టీ శ్రేణలు సంబరాలు చేసుకున్నాయి. కానీ.. టీఆర్ఎస్ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు రాలేదు. పైగా…
జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగిన రాయల నాగేశ్వరరావు.. కౌంటింగ్ను నిలిపివేయాలని కోరారు..…