ఎమ్మెల్యే సండ్ర వీరయ్య స్పీడ్ పెంచారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి?
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు ఈ పదవి కట్టబెట్టారు. కొత్తూరుకు పదవి రావడం వెనక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారని తెలియడంతో హీట్ ఇంకా పెరిగింది. పైగా మంత్రి పువ్వాడ అజయ్కు చెక్ పెట్టి తన జిల్లాకు పదవి పట్టుకుపోయారని అధికారపార్టీలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.
Also Read
సండ్ర అనుచరుడికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి..!
ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయిన కొత్తూరు ఉమాకు గతంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ను చేస్తామని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారట. కానీ.. మున్సిపల్ ఛైర్మన్ పదవి కమ్మ సామాజికవర్గానికి కేటాయించడంతో కొత్తూరు సామాజికవర్గానికి చెందిన ఆర్యవైశ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ వర్గాన్ని శాంతింపచేసేందుకు సండ్ర గట్టిగానే పోరాడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు.
టీఆర్ఎస్లో సండ్రకు ప్రాధాన్యం పెరిగిందని ప్రచారం..!
ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ పదవి అత్యధిక ముస్లింలకే కేటాయిస్తూ వస్తుంటాయి. నిన్న మొన్నటి వరకు ఎండీ ఖమర్ ఆ పదవిలో ఉన్నారు. అయితే ఖమర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న మంత్రి అజేయ్.. ఆయన్ని తప్పించాలని అనుకున్నారట. ఆ పోస్ట్లో అనుచరుడిని కూర్చోబెట్టాలని భావించారట అజేయ్. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర.. పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్నట్టు సమాచారం. ఖమర్ను మారిస్తే ఆ పదవి సత్తుపల్లికి కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్ఠానంపై ఒత్తాడి చేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సండ్రకు అధిష్ఠానం దగ్గర ప్రాధాన్యం పెరిగిందట. అది ఈ సందర్భంగా వర్కవుట్ అయిందని అనుకుంటున్నారట. దాంతో మంత్రి ఇలాకా నుంచి జిల్లా స్థాయి పదవిని సండ్ర పట్టుకెళ్లిపోయారని చర్చ మొదలైంది.
గతంలో ముస్లిం సామాజికవర్గానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి..!
అయితే.. జిల్లాలో ముస్లింలకే కచ్చితంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని కేటాయిస్తారని అనుకుంటున్న సమయంలో.. కొత్త మార్పు ఆ వర్గంలోనూ చర్చగా మారిందట. అందుకే ముస్లిం సామాజికవర్గాన్ని సంతృప్తి పర్చేందుకు అధికారపార్టీ నేతలు ఏం చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ఎమ్మెల్యే సండ్ర తీరుతోపాటు ఈ అంశంపైనా టీఆర్ఎస్లో చర్చ జరుగుతోందట. మరి.. ఈ సమస్యను పరిష్కరించేందుకు సండ్రే చొరవ తీసుకుంటారో.. అది తనపని కాదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!