ఖమ్మం టీఆర్ఎస్లో హీట్ పెంచిన ఎమ్మెల్సీ వ్యాఖ్యలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా ఉంది. నా గెలుపులో తీపి వేసింది ఎవరో మీకు తెలుసు, చేదు వేసింది ఎవరో మీకు తెలుసు.. అలానే ఇప్పుడు ఏ తప్పు జరిగిందో 2018లో కూడా అదే తప్పు జరిగిందని పేర్కొన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది.. కానీ, ఈ రోజు రాజకీయాలు అభివృద్ధికి నోచుకునే వారికన్నా డబ్బుకోసం రాజకీయం చేస్తున్న నేతలే ఉన్నారని కామెంట్ చేశారు.
మన పార్టీలో ఉన్న కొంతమంది వల్లే 2018లో ఎమ్మెల్యే లు ఓడిపోయారంటూ హాట్ కామెంట్లు చేసిన తాతా మధు.. తుమ్మల కూడా అలానే ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తుమ్మల పార్టీలో చేరిన తర్వాతే ఖమ్మంలో టీఆర్ఎస్ బలపడిందని స్పష్టం చేసిన ఆయన.. పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయొద్దని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారు అసలు పార్టీలో ఎందుకు ఉండాలి అంటూ ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరు రమ్మని పిలవలేదన్న ఆయన.. గులాబీ జెండా కింద మనం బతుకుదాం.. నీతి తప్పిన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అసలు వద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.. భారీ మెజార్టీ రావాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఓట్లుకు తూట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసిన మధు… అలానే ఈ పార్టీలో ఉండి వేరే పార్టీలో రాజకీయాలు చేయొద్దు అని చేతులు ఎత్తి వేడుకున్నారు.. మరోవైపు సీఎం కేసీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గన్ని మెచ్చుకున్నారని తెలిపిన ఆయన.. మీకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తా.. గత ఎమ్మెల్సీ పనిచేశారా? లేదా? అనేది నాకు అనవసరం, నేను మాత్రం అందరితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
Also Read
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
తాజావార్తలు
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!