పాత పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త కోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.
గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది. తాజాగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ భార్య లక్ష్మీ, కూతురు సాహిత్యలు చనిపోయారు. పెట్రోల్ కుటుంబ సభ్యుల అందరి మీద పోసి అగ్గి ముట్టించారు. అయితే ఒక్క కుతురు సాహితీ మంటల నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ముగ్గురు చనిపోగా సాహిత్య 60 శాతం గాయాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
Read Also:ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై డీజీపీకి లేఖరాసిన చంద్రబాబు
రామకృష్ణ ఇటీవల కాలంలో పలు వ్యాపారాలు చేసి నష్ట పోయాడు. 30 లక్షల దాకా అప్పులు పెరిగాయి. అయితే అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు ఇల్లు అమ్మాలని తల్లి పై ఒత్తిడి తెచ్చాడు. కానీ తల్లి ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో తల్లి, తన సోదరితో రామకృష్ణకు వివాదం కొనసాగుతోంది. దీంతో పాల్వంచలో తాను నడుపుతున్న మీసేవా కేంద్రాన్ని లీజుకు ఇచ్చేశాడు. ఆ తరువాత రాజమండ్రికి తన నివాసాన్ని మార్చాడు. అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు.
అయితే ఇల్లు అమ్మడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల వద్దకు వెళ్ళింది. గతంలో రామకృష్ణ అధికార పార్టీ నాయకులకు సహకరించాడు. ఎన్నికలలో ప్రచారం కూడా నిర్వహించారు. అధికార పార్టీ నేతకు చెందిన బంధువులకి రామకృష్ణ కుటుంబం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేతలు పంచాయతీలో పాల్గొన్నారు. ఆస్తి తగాదాపరిష్కారం చేస్తామని పలుమార్లు భేటీ అయ్యారు అయితే ఈ వ్యవహారంలో రామకృష్ణకు వ్యతిరేకంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి.
Read Also: 2018 చర్ల ఎన్ కౌంటర్పై హైకోర్టు కీలక తీర్పు
వనమా రాఘవేందర్రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం: ఏఎస్పీ, రోహిత్ రాజు
పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రాఘవేందర్ రావు పరారీలో ఉన్నారు. లోకేషన్ ట్రేస్ చేస్తున్నాం. అతని కోసం స్పెషల్ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయని, ఇదే ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!