పాత పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త కోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.
గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది. తాజాగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ భార్య లక్ష్మీ, కూతురు సాహిత్యలు చనిపోయారు. పెట్రోల్ కుటుంబ సభ్యుల అందరి మీద పోసి అగ్గి ముట్టించారు. అయితే ఒక్క కుతురు సాహితీ మంటల నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ముగ్గురు చనిపోగా సాహిత్య 60 శాతం గాయాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
Read Also:ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై డీజీపీకి లేఖరాసిన చంద్రబాబు
రామకృష్ణ ఇటీవల కాలంలో పలు వ్యాపారాలు చేసి నష్ట పోయాడు. 30 లక్షల దాకా అప్పులు పెరిగాయి. అయితే అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు ఇల్లు అమ్మాలని తల్లి పై ఒత్తిడి తెచ్చాడు. కానీ తల్లి ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో తల్లి, తన సోదరితో రామకృష్ణకు వివాదం కొనసాగుతోంది. దీంతో పాల్వంచలో తాను నడుపుతున్న మీసేవా కేంద్రాన్ని లీజుకు ఇచ్చేశాడు. ఆ తరువాత రాజమండ్రికి తన నివాసాన్ని మార్చాడు. అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు.
అయితే ఇల్లు అమ్మడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల వద్దకు వెళ్ళింది. గతంలో రామకృష్ణ అధికార పార్టీ నాయకులకు సహకరించాడు. ఎన్నికలలో ప్రచారం కూడా నిర్వహించారు. అధికార పార్టీ నేతకు చెందిన బంధువులకి రామకృష్ణ కుటుంబం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేతలు పంచాయతీలో పాల్గొన్నారు. ఆస్తి తగాదాపరిష్కారం చేస్తామని పలుమార్లు భేటీ అయ్యారు అయితే ఈ వ్యవహారంలో రామకృష్ణకు వ్యతిరేకంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి.
Read Also: 2018 చర్ల ఎన్ కౌంటర్పై హైకోర్టు కీలక తీర్పు
వనమా రాఘవేందర్రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం: ఏఎస్పీ, రోహిత్ రాజు
పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రాఘవేందర్ రావు పరారీలో ఉన్నారు. లోకేషన్ ట్రేస్ చేస్తున్నాం. అతని కోసం స్పెషల్ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయని, ఇదే ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!