రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. Read Also: గాంధీ ఆస్పత్రికి…
కొత్తగూడెంలో టీఆర్ఎస్కు కొత్త నేత అవసరం వచ్చిందా? వనమా రాఘవ వ్యవహారంతో జలగం అక్కడ మళ్లీ యాక్టివ్ అవుతారా? ఆ నియోజకవర్గంపై కన్నేసిన గులాబీ నేతలు ఎవరు? మారిన పరిణామాలు ఎవరికి ఆశలు రేకెత్తిస్తున్నాయి? కొత్తగూడెం టీఆర్ఎస్ పరిణామాలపై ఆసక్తిఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో.. రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు జైలు పాలయ్యారు. ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఒకవైపు వనమా రాఘవను టీఆర్ఎస్ సస్పెండ్…
తెలంగాణలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గులాబీ నేతలు తమ అధినేతపై అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బొమ్మను వెరైటీగా తయారుచేయించారు. 200 క్వింటాల్ నవ ధాన్యాలతో కేసీఆర్ బొమ్మతో పాటు జై తెలంగాణ, రైతు బంధు నినాదాలతో రూపొందించారు. పంట పొలాల్లో కేసీఆర్ బొమ్మని వడ్లు బియ్యం ,మొలకలతో తయారుచేసి వెరైటీగా రైతు బంధు ఉత్సవాలను నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీనిపై ఊరి పేరుతో పాటు జై…
అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది.…
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…
అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి? ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు…
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రజాసేవనే ప్రజలు గుర్తుంచుకుంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, సౌమ్యుడైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాదిరిగా కొంత కఠినంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత తాతా మధుసూదన్ అన్నారు. స్థానిక సంస్థల…
ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదని ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా…
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక…