తెలంగాణ అంతటా ఒకతీరు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకతీరు. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. మళ్లీ తాజాగా ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయనను గులాబీ అధినేత పెద్దల సభకు పంపుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎంవో నుంచి కాల్ వచ్చిందని పదవి ఇస్తామని చెప్పినట్లుగా .. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అని అంటున్నారు. నామినేషన్ తేదీ.. నామినేషన్…
కాదేదీ మోసానికి అనర్హం. బ్యాంకుల పేరు చెప్పి.. ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నెంబర్లతో ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టేవారు మరికొందరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది. కొంత మంది తెలివిగల వారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది. వస్తువు కొన్న తరువాత మీ అక్కౌంటులోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి. కానీ డబ్బులు మాత్రం రావు..ఇది నకిలీ…
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయ్. గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్తో రెండు వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్భవన్పై పదునైన విమర్శలు చేస్తున్నారు మంత్రులు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి వేడెక్కిందని పరిశీలకు భావిస్తున్నారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి…
సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు,…
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక,…
వి.హనుమంతరావు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోకపోయినా వీహెచ్ మాత్రం వెంటనే స్పందిస్తారు. మొహమాటం లేకుండా కొబ్బరి కాయ కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో బాగా సందడి చేశారు. కోలాటం ఆడి అటు కాంగ్రెస్ కార్యకర్తల్ని, ప్రజల్ని అలరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో సీఎల్పీనేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఈ పాదయాత్రలో వీహెచ్ పాల్గొన్నారు. కార్యకర్తలను తన…
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం..…
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది… ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే, ఆత్మహత్యాయత్నం తర్వాత మీడియాకు సాయి గణేష్ ఇచ్చిన బైట్ సంచలనంగా మారింది.. మంత్రి పువ్వాడ అజయ్తో పాటు పోలీసులపై ఆరోపణలు చేశాడు సాయి.. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. Read Also:…
తెలంగాణలో సంచలనం కలిగించిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆతహత్యాయత్నంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సాయి గణేష్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం వెనుక కారణం అయినవారిని వెంటనే శిక్షించాలన్నారు. ఓ ఆటోలో పోలీసులు సాయి గణేష్ ని తీసుకువెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి లో వదిలి వెళ్ళారని, సాయి గణేష్ ను మెరుగైన వైద్యం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి…