Gangula Kamalakar:సీఎం కేసీఆర్ కు బీసీలు రుణ పడి ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ కులాలకు గత పాలకులు చదువును దూరం చేశారని, 75 ఏళ్ల పాలనలో 19 బీసీ గురుకులు మాత్రమే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ బిడ్డలను ముందుకు తీసుకొని పోవటానికి 200 బీసీ గురుకులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
బీసీ బిడ్డలు సీఎం కేసీఆర్ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. బీసీ కులాల బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగులు కోసం పోటీ పడుతున్నారు. వారి కోసం స్టడీ సెంటర్లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ స్టడీ సెంటర్లను ఉపయోగించుకొని బీసీలు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
1.20వేల మంది బీసీలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని, గ్రూప్1 ఉద్యోగల భర్తీలో ఎటువంటి పైరవీలకు తావు లేదని అన్నారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన ప్రజల ప్రభుత్వం, బీసీ కులాలు అభివృద్ధికీ పాటుపడే ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా డబ్బులు ఇస్తున్న ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు.
నా చేతుల మీదుగా.. ఎంతో మంది ఆడబిడ్డలను చెక్కులు అందజేశానని అందుకు నాకు ఎంతో ఆనందంగా వుందని పేర్కొన్నారు. మా బీసీల అభివృద్ధికీ జిల్లాలో పాటుపడుతున్న మంత్రి అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు అని అన్నారు.
ఒక్క క్షణం.. ఆలోచించండి.. సోషల్ మీడియా దేనికి వాడుతున్నారు మీరు..?
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!