ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Amit shah Tour Cancel: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యే అవకాశం ఉంది. బిపార్జోయ్ తుఫాన్ ఆయన పర్యటనను ప్రభావితం చూపనుంది.
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్ ను బీజేపీ విడుదల చేసింది. ఈనెల 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ముందుగా ఈనెల 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి షా చేరుకుంటారు.
School Bus: ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నడిరోడ్డుపై స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు.
Ponguleti Srinivas Reddy: లక్షల మంది అభిమానుల మధ్య నే ఖమ్మం నడి బోడ్డునే పార్టీ లో జాయిన్ అవుతా అని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా కోసం వచ్చిన నా కుటుంబ సభ్యుల అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిలా మారుమూల ప్రాంతాల నుండి ఒక్క పిలుపుతో వచ్చారని అన్నారు. పార్టీ మార్పు…
మానస ఆత్మహత్య అనంతరం పోస్టు మార్టం పూర్తి అయ్యింది. బంధువులు హన్మకొండకు తీసుకుని వెళ్లారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదని బందువులు అంటున్నారు.