అమిత్షా తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు భద్రాచలం కార్యక్రమం క్యాన్సిల్ అయింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు షా రానున్నారు.
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభలో షా పాల్గొంటారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోటీపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని ఉండెను.. కానీ మీ అభిమానం చూసిన తరువాత జిల్లా కోసం రాజకీయాల్లో ఉండాలని అనుకున్నానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
తెలంగాణాలో వరుస హత్యలు జరుగుతున్నాయి.. తాజాగా గవర్నమెంట్ టీచర్ హత్య సంచలనాలను క్రియేట్ చేస్తుంది.. పాఠశాలకు వెళుతుండగా ఉపాధ్యాయుడి బైక్ ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కిందపడిపోయిన టీచర్ ను గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు.. ఈ ఘటన తో జిల్లా ఉలిక్కి పడింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారిప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పిఈటిగా పనిచేస్తున్నాడు..…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు అని కాంగ్రెస్ ప్రచాక కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణమాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు.