Israel-Iran War: మధ్యప్రాచ్యం అతలాకుతలం అవుతోంది. ఇరాన్పై యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. శనివారం మొదలైన దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. టాప్ ఇరాన్ అధికారులు మరణించారు.
Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.…
Iran: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఇరాన్పై తీవ్రమవుతున్నాయి. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ టాప్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని తుడిచిపెట్టినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.
పశ్చిమాసియాలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఒక “నైతికతమానవత్వం లేని క్రూరమైన హత్య” (Cynical Murder) గా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక దేశ అత్యున్నత నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం భయంకరమైన పరిణామాలకు…
Ayatollah Arafi: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయన తాత్కాలిక సుప్రీం లీడర్గా పనిచేస్తారని తెలిపింది. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియలో వారసుడిని ఎన్నుకునే వరకు, సుప్రీం లీడర్గా విధులు బాధ్యత కలిగిన తాత్కాలిక నాయకత్వ మండలిలో అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా నియమించారు. Read…
Israel: ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ దాడులు చేస్తోంది. శనివారం అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది.
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. రెండు దేశాలు కవ్వింపులకు దిగుతున్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.