Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Dentist: కేరళలో ఓ పెషేంట్కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది. డెంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ షైనీ ఆంటోనీ రౌఫ్ వట్టుకులానికి చెందిన కే ఆర్ ఉషా కుమారికి పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో కమీషన్ పేర్కొంది.
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
Kerala: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.
BJP leader Ranjith Srinivasan Murder Case: కేరళ సెషన్స్ కోర్టు మంగళవారం (జనవరి 30) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితులు అందరూ ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వారు కావడం గమనార్హం. కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.…
కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
Mercy killing: పుట్టుకతోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలకు మరణాన్ని ప్రసాదించాలంటూ కేరళకు చెందిన ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్సను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబీలకు చెప్పారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కుటుంబంలోని ఐదుగురు ‘మెర్సి కిల్లింగ్’ కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా ఈ రోజు రాజధాని తిరువనంతపురం నుంచి కొల్లాం జిల్లాకు వెళ్తున్న సమయంలో సీపీఎంకి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యులు గవర్నర్కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు.