Space station: 2035 నాటికి సొంత “అంతరిక్ష కేంద్రం”.. ప్రధాని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Space station: 2035 నాటికి భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు.
21వ శతాబ్ధంలో భారతదేశం డైనమిక్ గ్లోబల్ ప్లేయర్గా ఎదుగుతోందని, గణనీయమైన పరోగతిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. భారత్ తన శక్తితో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని, గత 10 ఏళ్లలో 400 శాటిలైట్లను ప్రయోగించామని, 10 ఏళ్లకు ముందు 33 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించామని ప్రధాని వెల్లడించారు. గగన్యాన్ మిషన్లో ఉపయోగించే పరికరాలు ఎక్కువగా భారతదేశంలోనే తయారు చేయబడటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న తరుణంలో, గగన్యాన్ ప్రయోగం చేపట్టడం మన అంతరిక్ష రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Also Read
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
Read Also: Kejriwal: కేజ్రీవాల్కు మళ్లీ ఈడీ నోటీసు.. ఇది ఎన్నో సారంటే..!
2024-25లో భారత్ తొలిసారిగా నిర్వహించబోతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్లో భాగమైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ ప్రయోగంలో భాగం కానున్నారు. నలుగురు ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్లు, రష్యాలోని యూరిగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. గగన్ యాన్ మిషన్ కోసం 400 కి.మీ కక్ష్యలో భారత వ్యోమగాముల్ని ప్రవేశపెట్టనున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రయోగం జరుగుతుంది. ఆ తరువాత వీరిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..