Gaganyaan Astronauts: గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములు.. పరిచయం చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు. భారత వైమానిక దళానికి చెందిన ఈ వీరులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే.. పలువురు అభ్యర్థులను పరిశీలించి.. చివరికి నలుగురు అభ్యర్థుల జాబితాను ఇస్రో సిద్ధం చేసింది.
Read Also: Mangalavaaram: మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యోమగాములను వేదికపైకి పిలిచి ప్రపంచానికి పరిచయం చేశారు. గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల పేర్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వైమానిక దళానికి చెందిన ఈ ధైర్యవంతులకు అన్ని రకాల యుద్ధ విమానాల గురించి తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Anil Ambani : రిలయన్స్ క్యాపిటల్ ను కొనుగోలు చేయనున్న హిందూజా గ్రూప్
అయితే, గగన్యాన్ ప్రాజెక్టు కింద భారత అంతరిక్ష సంస్థ సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను మూడు రోజుల పాటు పంపి భూమిపై సురక్షితంగా దింపనుంది. ఇది, మొదటి మానవరహిత మిషన్ (G1 2024)గా నిలవనుంది. కాగా, గగన్యాన్ మిషన్పై ఆసక్తి కనబరిచిన టెస్ట్ పైలట్లలో, మొదటి దశ ఎంపికలో ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇది 2019 సంవత్సరంలో బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కింద పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్లో నిర్వహించబడింది. అనేక రౌండ్ల ఎంపిక ప్రక్రియ తర్వాత IAM నాలుగురి పేర్లను ఆమోదించింది. 2020 సంవత్సరంలో శిక్షణ కోసం ఇస్రో నలుగురిని రష్యాకు పంపింది. ఈ శిక్షణ 2021 సంవత్సరంలో ముగిసింది. కానీ, కోవిడ్-19 కారణంగా శిక్షణ పూర్తి కావడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!