Gaganyaan Astronauts: గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములు.. పరిచయం చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు. భారత వైమానిక దళానికి చెందిన ఈ వీరులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే.. పలువురు అభ్యర్థులను పరిశీలించి.. చివరికి నలుగురు అభ్యర్థుల జాబితాను ఇస్రో సిద్ధం చేసింది.
Read Also: Mangalavaaram: మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది
Also Read
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యోమగాములను వేదికపైకి పిలిచి ప్రపంచానికి పరిచయం చేశారు. గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల పేర్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వైమానిక దళానికి చెందిన ఈ ధైర్యవంతులకు అన్ని రకాల యుద్ధ విమానాల గురించి తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Anil Ambani : రిలయన్స్ క్యాపిటల్ ను కొనుగోలు చేయనున్న హిందూజా గ్రూప్
అయితే, గగన్యాన్ ప్రాజెక్టు కింద భారత అంతరిక్ష సంస్థ సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను మూడు రోజుల పాటు పంపి భూమిపై సురక్షితంగా దింపనుంది. ఇది, మొదటి మానవరహిత మిషన్ (G1 2024)గా నిలవనుంది. కాగా, గగన్యాన్ మిషన్పై ఆసక్తి కనబరిచిన టెస్ట్ పైలట్లలో, మొదటి దశ ఎంపికలో ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇది 2019 సంవత్సరంలో బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కింద పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్లో నిర్వహించబడింది. అనేక రౌండ్ల ఎంపిక ప్రక్రియ తర్వాత IAM నాలుగురి పేర్లను ఆమోదించింది. 2020 సంవత్సరంలో శిక్షణ కోసం ఇస్రో నలుగురిని రష్యాకు పంపింది. ఈ శిక్షణ 2021 సంవత్సరంలో ముగిసింది. కానీ, కోవిడ్-19 కారణంగా శిక్షణ పూర్తి కావడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!