Sabarimala: కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు యాత్రా సీజన్లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
Priyanka Gandhi: కేరళలోని వాయనాడ్లో జరగనున్న లోక్సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 3 నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 3న ప్రియాంక గాంధీ తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన గురించి శుక్రవారం సమాచారం ఇస్తూ.. నవంబర్ 7 వరకు కేరళలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంతో పాటు…
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.
Explosion Sounds In Kerala: కేరళలోని మలప్పురం జిల్లా అనక్కల్లు ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దానితో ఆ ప్రాంతంలో తేలికపాటి భూకంపం సంభవించినట్లయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో 280 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. Also Read: Bomb Threat: తిరుపతిలో మళ్లీ కలకలం.. 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు అందిన సమాచారం ప్రకారం.. పేలుడు శబ్దాలు వినడంతో,…
YouTuber Couple Found Dead: కేరళలో యూట్యూబ్ జంట మృతి సంచలనంగా మారింది. కేరళోని పరస్సాల పట్టణంలోని వారిని నివాసంలో ఆదివారం శవాలుగా కనిపించారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Navya Haridas: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె నిర్వహించిన రోడ్ షోతో పాటు బహిరంగ సభపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Wayanad bypoll:కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రియాంకా తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.