Rain Alert: అలర్ట్.. మరి కొన్ని గంటల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
- నవంబర్ 12-15 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు
- నవంబర్ 12-15 మధ్య తెలంగాణలో వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
Also Read
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
అయితే.. నవంబర్ 9-15 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. దీనితో పాటు నవంబర్ 9-15 తేదీల్లో తమిళనాడు, నవంబర్ 13-15 తేదీల్లో కేరళ, మహేతో పాటు నవంబర్ 12, 13 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 10-12 తేదీలలో హిమాచల్ ప్రదేశ్లో, నవంబర్ 10-11 తేదీలలో వాయువ్య పంజాబ్లో దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.
READ MORE:Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
కాగా.. జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్లలో కనిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఈరోజు మైదాన ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని హిండన్లో 13.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో, రాబోయే నాలుగైదు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల కనిపించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
READ MORE:Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
నవంబర్ 12-15 మధ్య తెలంగాణలో వర్ష సూచన..
నవంబర్ 12 – 15 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ శనివారం సమాచారం వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!