Kerala: మదర్సాలో ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి ప్రైవేట్ భాగాలపై ఎర్ర కారం పూసి…
- మదర్సాలో ఉపాధ్యాయుడి దాష్టీకం
- విద్యార్థిని ఇనుప రాడ్డుతో కల్చిన టీచర్
- ప్రైవేటు భాగాలపై ఎర్ర కారం పూసి చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని మలప్పురం జిల్లా తానూర్లో గురువు, శిష్యుల మధ్య సంబంధాన్ని అవమానపరిచే భయానక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక మదర్సా ఉపాధ్యాయుడు తన ఆదేశాలను పాటించనందుకు ఒక విద్యార్థికి హృదయ విదారకమైన శిక్ష విధించాడు. మొదట విద్యార్థిని తీవ్రంగా కొట్టి, వేడిచేసిన ఇనుప రాడ్డుతో కాల్చాడు. ఇది అతనికి సంతృప్తి కలిగించకపోవడంతో, అతను ఆమె ప్రైవేట్ భాగాలపై ఎర్ర కారం పొడిని పూశాడు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి..
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
నిందితుడి పేరు ఉమైర్ అష్రాఫీ అని సీనియర్ పోలీసు అధికారి శనివారం తెలిపారు. నేరం చేసిన తర్వాత కేరళ నుంచి కర్ణాటకకు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల భయంతో తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. ఈ కేసులో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఇండియన్ జ్యుడీషియల్ కోడ్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం వెతకడం ప్రారంభించారు. తాజాగా.. నిందితుడు టీచర్ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి సొంత జిల్లాకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తానూర్కు చేరుకున్న పోలీసు బృందం గురువారం అతడి రాక కోసం వేచి చూశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత పట్టుబడ్డాడు. ఉమైర్ అష్రాఫీని స్థానిక కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.
READ MORE:HSBC Alert: ఆ వాట్సప్ మెసేజ్లు నమ్మొద్దు.. కస్టమర్లకు హెచ్ఎస్బీసీ సూచన
ఈ ఏడాది జనవరిలో కేరళలోని మలప్పురం జిల్లాలోని కొండొట్టిలో బాలికలపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. నిందితుడిని హయ్యర్ సెకండరీ స్కూల్లో బోధించే 52 ఏళ్ల ఫైసల్గా గుర్తించారు. ఐదుగురు విద్యార్థినులను వేధించాడు. వేధింపులకు గురైన విద్యార్థినులు ఈ విషయాన్ని ముందుగా వారి కుటుంబాలకు తెలియజేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఫిర్యాదు అనంతరం పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!