కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎమ్మెల్యే కేపీ.మోహనన్కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం చేశారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగానే స్థానికులు నిలదీశారు.
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.
Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర…
Kerala: కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది.
ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన…
కేరళలోని కొచ్చిలోని కెనరా బ్యాంక్ శాఖ వద్ద ఒక విచిత్రమైన నిరసన కనిపించింది. ఆఫీసు, క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలన్న ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బయటకు వచ్చి గొడ్డు మాంసం, పరాఠాలు వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కేరళలో బాధ్యతలు స్వీకరించిన బీహార్ స్థానికుడైన రీజినల్ మేనేజర్, కెనరా బ్యాంక్ క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) మొదట మేనేజర్ మానసిక వేధింపులు,…
కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆరోపణలు రాగానే ముందుగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తాజాగా అతడిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.