బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.
Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభ పడిందిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కలిసారు.
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
కేసీఆర్ గొప్ప నాయకుడని ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని దానం అన్నారు. తన అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని అన్నారు. వాళ్లు చేసింది సభబైతే ఇప్పుడు జరుగుతున్నది సబబేనని అన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మూడు నెలల్లో ముఖ్యమంత్రి 3500 కోట్లు సంపాదిస్తే పది సంవత్సరాల…
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. నేను పార్టీ మారను. ఏ పార్టీలోకి వెళ్ళనని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారతాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయం నా వృత్తి, వైద్యం నా ప్రవృత్తి అని ఆయన తెలిపారు. వాళ్లు వీళ్లు పార్టీలు మారుతున్నట్టు నేను…
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. Prakash…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు.
కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు…