రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామెట్ కథ అడ్డం తిరిగింది చందంలా తయారు అయ్యింది అని ఆయన వ్యాఖ్యనించారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ( ఆదివారం ) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు కేసీఆర్ సర్కార్ కు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చివరి రోజైన ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది.
కేసీఆర్ ఎన్నికల తరవాత పత్తా లేకుండా పోతాడు.. ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు.. ఆర్టీసీ కార్మికుల మరణానికి కారణం అయిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు.
కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయడం ఎన్నికల స్టంటే అని ఆయన కుండబద్దలు కొట్టారు. పీర్జదిగుడా, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లలో వివిధ కార్యక్రమలకు మంత్రి మల్లారెడ్డి హాజరు అయ్యాడు. పీర్జదిగుడా పార్టీ కార్యాలయం దగ్గర కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్, కార్పొరేటర్లు పాలభిషేకం చేశారు.
వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Central Team: నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది.
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.