ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది అయితే.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది అని ఆయన వ్యాఖ్యనించారు. ఎన్నికలు రాగానే అధ్యక్షులు మార్చుతున్నారు.. ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్న మీకు ఓటమి తప్పదు అని హరీశ్ రావు అన్నారు. మీ ప్రయత్నాలు ఫలించావు.. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే ప్రభంజనం అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవ్వరినీ గెలువనియ్యను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టింది.. చావు నోటి వరకు వెళ్లి తెలంగాణ తీసుకుని వచ్చనన్ని కేసీఆర్ చెబుతుంటారు.. అనాడు పండ్ల రసం డ్రింక్ త్రాగింది నిజం కదా.. ఉద్యమంలో యాక్టింగ్ చేశావు తప్ప మరేమీ లేదు అని పొంగులేటి అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే ప్రజలను భయ బ్రాంతులను చేయడంలో నిష్ణాతులు అని ఆయన తెలిపారు.
రాజకీయ పార్టీ అభివృద్ది కేవలం యువతతోనే సాధ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టడంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేయాల్సిన ఉద్యోగ భర్తీలు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఇప్పటికీ అలానే ఉంది. శాసన సభ వేదికగా సిఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి…
ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ఈ సారి దేశానికి ప్రధాన మంత్రిగా కేసీఆర్ కావాలని అని కోరుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశవ్యాప్తంగా కావాలంటే కేసీఆర్ ప్రధాని అయితేనే ఈ డెవలప్మెంట్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ది చేస్తామని చేయడం లేదని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆయన తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నడనే బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారు అని హనుమంతరావు అన్నారు. అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తెలిపారు..
మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై 2వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ సభ కోసం దాదాపు 5 లక్షల మంది ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ జన గర్జన సభకు ఆటంకాలు కలిగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తొందని పొంగులేటి మండిపడ్డారు.
ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు.
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కోవర్టులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. ఈటల రాజేందర్ అనేటోడు పార్టీ మారడు.. అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ కామెంట్స్ చేశారు.