Kishan Reddy: అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తాం
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. రామగుండం NTPCకి మోడీనే శంఖుస్థాపన చేశారు, ప్రారంభం చేశారని కేంద్రమంత్రి అన్నారు. ఎరువుల సమస్యను తీర్చింది మోడీనేనని.. కొరత, కోతలు లేని నూతన భారతావనిని మోడీ ఆవిష్కరించారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎరువుల మీద 2 లక్షల సబ్సిడీ కేంద్రం ఇస్తుందని తెలిపారు. ఎరువుల పరిశ్రమ, NTPC ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు.
కొడుకు సీఎం, అయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజల పై లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు చితశుద్ది లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ కాదు… దాన్ని మెంటైన్ చేయలేమని అంటున్నారని తెలిపారు. ఇంజనీర్లను పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్ గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను కేసీఆర్ ముంచుతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి అంటే నదుల అనుసంధానం జరగాలని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారని.. రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని.. కేంద్రం చిత్తశుద్దితో సహకారం చేస్తుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం… కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
- Tags
- bjp
- BRS
- kcr
- Kishan Reddy
- telugu news
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో