Chada Venkata Reddy: దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వామపక్షాల మద్దతు తీసుకొని.. మరోవైపు కేసీఆర్ హడావిడిగా అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో మహాకూటమి ఏర్పాటులో జాప్యం జరగడంతో తమ పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు.
Minister KTR: ఈనెల 16న కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
మరోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఐదు అసెంబ్లీ సీట్లు అయిన బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీత, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ ప్రజా ఆస్తులను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.
Mrunal Takur : అయ్యో సీతకు ఎంత కష్టం వచ్చిందో.. ఆ సమస్యతో భాధ పడుతున్న మృణాల్..
బీఆర్ఎస్ పాలనలో చట్టాలను చుట్టాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ధరణి పోర్టల్ దరిద్రపు పోర్టల్ గా ఉంది, ధరణి పోర్టల్ కి వైరస్ పట్టిందని దుయ్యబట్టారు. మతోన్మాద, దోపిడీ పాలన నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏర్పాటు అయ్యే కూటమిని గెలిపించాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!