Chada Venkata Reddy: దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వామపక్షాల మద్దతు తీసుకొని.. మరోవైపు కేసీఆర్ హడావిడిగా అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో మహాకూటమి ఏర్పాటులో జాప్యం జరగడంతో తమ పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు.
Minister KTR: ఈనెల 16న కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
మరోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఐదు అసెంబ్లీ సీట్లు అయిన బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీత, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ ప్రజా ఆస్తులను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.
Mrunal Takur : అయ్యో సీతకు ఎంత కష్టం వచ్చిందో.. ఆ సమస్యతో భాధ పడుతున్న మృణాల్..
బీఆర్ఎస్ పాలనలో చట్టాలను చుట్టాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ధరణి పోర్టల్ దరిద్రపు పోర్టల్ గా ఉంది, ధరణి పోర్టల్ కి వైరస్ పట్టిందని దుయ్యబట్టారు. మతోన్మాద, దోపిడీ పాలన నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏర్పాటు అయ్యే కూటమిని గెలిపించాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!