Chada Venkata Reddy: దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వామపక్షాల మద్దతు తీసుకొని.. మరోవైపు కేసీఆర్ హడావిడిగా అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో మహాకూటమి ఏర్పాటులో జాప్యం జరగడంతో తమ పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు.
Minister KTR: ఈనెల 16న కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
మరోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఐదు అసెంబ్లీ సీట్లు అయిన బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీత, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ ప్రజా ఆస్తులను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.
Mrunal Takur : అయ్యో సీతకు ఎంత కష్టం వచ్చిందో.. ఆ సమస్యతో భాధ పడుతున్న మృణాల్..
బీఆర్ఎస్ పాలనలో చట్టాలను చుట్టాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ధరణి పోర్టల్ దరిద్రపు పోర్టల్ గా ఉంది, ధరణి పోర్టల్ కి వైరస్ పట్టిందని దుయ్యబట్టారు. మతోన్మాద, దోపిడీ పాలన నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏర్పాటు అయ్యే కూటమిని గెలిపించాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!