దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో తల్లి భవానీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు అయింది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరుకు రానున్నారు. బీజేపీ పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల…
BJP: బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీయే కూటమికి ‘‘400’’ సీట్లు రావడం లేదు. చివరకు 300కి దరిదాపుల్లోనే ఆగిపోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఫలితాలను సాధించలేదు. గత రెండు పర్యాయాలు 2014, 2019లో మొత్తం 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా గెలుచుకున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ…
Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతగురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దెయ్యం పట్టిందనే నెపంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. స్థానిక మసీదులో ఉంటున్నాడు. అయితే.. బాలిక మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ ఉంటుంది.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. నిన్న జర్మనీ నుంచి బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్ని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది.