karnataka: కొత్త టూరిజం పాలసీ తీసుకొస్తామన్న డీకే.శివకుమార్
- కర్ణాటక పరిశ్రమలోకి కొత్త టూరిజం పాలసీ
- త్వరలో ప్రవేశపెడతామన్న డిప్యూటీ సీఎం డీకే..శివకుమార్
- దక్షిణాది పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక టూరిజం శాఖ నిర్వహించిన ‘దక్షిణ్ భారత్ ఉత్సవ్’ కార్యక్రమంలో డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. మంచి టూరిజం పాలసీ వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. పారిశ్రామికవేత్తలు బాగా పనిచేసినప్పుడు.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయని.. అలాగే పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ నుంచి చాలా మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వారి అనుభవాలను కర్ణాటకలో పంచుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో 300 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. బెంగళూరు ఐటీ రాజధానితో పాటు పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కార్యకర్త కోరిక మేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు
బెంగళూరులో కబ్బన్ పార్క్ మరియు లాల్ బాగ్ సంప్రదాయ పర్యాటక ప్రదేశాలు. కొత్త తరం ప్రజల కోసం కొత్త పర్యాటక ప్రదేశాలను రూపొందించడానికి బెంగళూరులో స్కై డెక్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 8-10 రోజుల్లో స్కై డెక్ కోసం కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. డిస్నీల్యాండ్ తరహాలో బృందావన గార్డెన్ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం గత బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగాయని గుర్తుచేశారు. జీఎస్టీ కారణంగా పెట్టుబడులు రావడం లేదని, వ్యాపారులు మొగ్గు చూపడం లేదని డీకే.శివకుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!