karnataka: కొత్త టూరిజం పాలసీ తీసుకొస్తామన్న డీకే.శివకుమార్
- కర్ణాటక పరిశ్రమలోకి కొత్త టూరిజం పాలసీ
- త్వరలో ప్రవేశపెడతామన్న డిప్యూటీ సీఎం డీకే..శివకుమార్
- దక్షిణాది పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక టూరిజం శాఖ నిర్వహించిన ‘దక్షిణ్ భారత్ ఉత్సవ్’ కార్యక్రమంలో డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. మంచి టూరిజం పాలసీ వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. పారిశ్రామికవేత్తలు బాగా పనిచేసినప్పుడు.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయని.. అలాగే పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ నుంచి చాలా మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వారి అనుభవాలను కర్ణాటకలో పంచుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో 300 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. బెంగళూరు ఐటీ రాజధానితో పాటు పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కార్యకర్త కోరిక మేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు
బెంగళూరులో కబ్బన్ పార్క్ మరియు లాల్ బాగ్ సంప్రదాయ పర్యాటక ప్రదేశాలు. కొత్త తరం ప్రజల కోసం కొత్త పర్యాటక ప్రదేశాలను రూపొందించడానికి బెంగళూరులో స్కై డెక్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 8-10 రోజుల్లో స్కై డెక్ కోసం కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. డిస్నీల్యాండ్ తరహాలో బృందావన గార్డెన్ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం గత బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగాయని గుర్తుచేశారు. జీఎస్టీ కారణంగా పెట్టుబడులు రావడం లేదని, వ్యాపారులు మొగ్గు చూపడం లేదని డీకే.శివకుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!