Bangalore Stampede: బెంగళూరు నగరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం…
తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం..
బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడింది. ఆమె వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం.. అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నివేదికను గత గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా నివేదికకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు.
కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
No Smoking: కర్నాటక ప్రభుత్వం తమ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం లేదా పొగాకు ఉత్పత్తులను సేవించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR) జారీ చేసిన సర్క్యులర్లో ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్టబద్ధమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా కార్యాలయ ఆవరణలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును…
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Congress : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో సమావేశమయ్యారు.
అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు.