Ranya Rao: రన్యారావు కేసులో తండ్రి పాత్రపై ప్రభుత్వానికి నివేదిక.. ఏం తేలిందంటే..!
- రన్యారావు కేసులో తండ్రి పాత్రపై ప్రభుత్వానికి నివేదిక
- కీలక విషయాలు బయటపెట్టిన అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడింది. ఆమె వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం.. అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నివేదికను గత గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా నివేదికకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటక ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. మార్చి 3న బెంగళూరు ఎయిర్పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. అనంతరం ఆమె నివాసాన్ని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక డీఆర్ఐ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కీలక అంశాలు వెలుగుచూశాయి. తండ్రి పరపతిని ఉపయోగించుకుని వీఐపీ ప్రొటోకాల్లో ఆమె పలుమార్లు బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా 3 నెలల కాలంలోనే 27 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చినట్లుగా కనిపెట్టారు. ఇదెలా సాధ్యమైందని ఆరా తీయగా.. తండ్రి రామచంద్రరావు అధికారాన్ని ఉపయోగించుకుని బయటకు వచ్చేసినట్లుగా కనిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ్ గుప్తా నివేదిక సమర్పించింది. ఈ నివేదికతో సంబంధం ఉన్న ఒక అధికారి కీలక విషయాలు వెల్లడించారు. బంగారం స్మగ్లింగ్ విషయం రామచంద్రరావుకు తెలియదని.. కాకపోతే రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుంటున్న విషయం మాత్రం తెలుసని నివేదికలో పేర్కొన్నారు. వీఐపీ ప్రొటోకాల్ను బంగారం స్మగ్లింగ్ కోసం ఉపయోగించుకుంటున్నట్లు మాత్రం రామచంద్రరావుకి తెలియదన్నారు. గోల్డ్ స్మగ్లింగ్లో రామచంద్రరావుకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని దర్యాప్తు బృందం తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
రామచంద్రరావు.. అక్టోబర్ 2023 నుంచి డీజీపీగా పనిచేస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే రామచంద్రరావుపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో హవాలా డబ్బు మాయం చేసినట్లుగా రామచంద్రరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్గా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కుమార్తె విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
ఇది కూడా చదవండి: Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్డౌన్..
తాజావార్తలు
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!