Virat Kohli Century: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అదిరిపోయే రీతిలో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో విరాట్ 10 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 143 బంతుల్లో…
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లోని అక్టోపస్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ…
టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా సేనా దేశాలపై ఏడు సార్లు అయిదు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి…
పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను అవుట్ చేశాడు. బ్యాటింగ్లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన…
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.…
Ind vs Aus KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంచ్ సమయానికి 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో, లంచ్కు కొంత సమయం ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అవుట్ అయినా తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. మొదట ఫీల్డ్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే పెర్త్ టెస్టుకు ఓ అరుదైన ఘనత దక్కింది. క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. 1947 తర్వాత తొలిసారి ఇరు జట్ల సారథులూ బౌలర్లే కావడం ఇదే మొదటిసారి. భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్కు ప్యాట్ కమిన్స్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. 2021 చివరి నుండి ప్యాట్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సమయం ఆసన్నమైంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పెర్త్ పిచ్లో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్ ఆటగాళ్లు.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. పెర్త్లో ట్రైనింగ్ సెషన్ను ప్రత్యక్షంగా చూసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు…