బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో 8 వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో 4 వికెట్స్ తీశాడు. బ్రిస్బేన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్లు విఫలమైన చోట ఆరు వికెట్స్ పడగొట్టిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన…
భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం.. శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ కోసం…
Mohammed Shami Double Century: ప్రస్తుతం దేశంలో దేశీయ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ టి20గా జరుగుతోంది. ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో బరోడా జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్…
ICC Mens Player Of The Month: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా నవంబర్ 2024 నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ జస్ప్రీత్ బుమ్రాను నామినేట్ చేసింది. బుమ్రాతో పాటు మార్కో యాన్సెన్, హారిస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. తాజాగా ఐసీసీ ఈ అవార్డు విజేతను ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ ఈ…
ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు.…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత…
ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అద్భుత బౌలింగ్తో ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం వణికిస్తున్నాడు. బుమ్రా అంటేనే బ్యాటర్స్ భయపడిపోతున్నారు. ప్రస్తుతం బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ పేసర్గా బుమ్రాను అందరూ కీర్తిస్తున్నారు. తామే గొప్ప అన్నట్లు మాట్లాడే.. ఆస్ట్రేలియన్లు కూడా బుమ్రాను పొగిడేస్తున్నారు. బుమ్రాను ఇప్పటికే చాలా సార్లు ఎదుర్కొన్నా అని, అయినా అతడి బౌలింగ్ శైలి అంతుచిక్కదు అని ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్…
Highest Paid Indian Cricketers: ఇటీవల ఐపిఎల్ 2025 కు సంబంధించి మెగా వేలం పూర్తయింది. ఈ వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్మడుపోయాడు. రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో అతడు సరికొత్త రికార్డులను సృష్టించాడు. పంత్ తర్వాత శ్రేయ సయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకొని రెండో అత్యధిక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇకపోతే…