Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వేలంలో ఉంటే.. రూ.520 కోట్లు కూడా సరిపోవు!
- జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం
- బుమ్రా వేలంలోకి వస్తే అద్భుతమే జరిగేది
- తొలి ప్రాధాన్య ఆటగాడిగా బుమ్రాను ముంబై రిటైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్ధమవుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లోని తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించిన విషయం తెలిసిందే. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించి విజయాన్ని అందించాడు. రోహిత్, శుభ్మన్ గిల్ లేకున్నా.. తన బౌలింగ్తో ఆతిథ్య ఆస్ట్రేలియాను వణికించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురై ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టును బుమ్రా అద్భుతంగా ముందుకు నడిపించాడు. అద్భుత బౌలింగ్ విన్యాసాలతో మ్యాచ్ను మలుపు తిప్పిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్కు కోచ్ ఆశిశ్ నెహ్రా స్పందించాడు.
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
Also Read: Donald Trump: బాధ్యతలు స్వీకరించముందే విడిచిపెట్టండి.. లేదంటే నరకం చూపిస్తా: ట్రంప్
‘బౌలర్గా బుమ్రా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో పెర్త్ టెస్ట్ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. లీడ్ పేసర్, కెప్టెన్ కాబట్టి బుమ్రాపై ఒత్తిడి బాగా ఉండాలి. కానీ అతడు ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం చాలా ప్రశంసనీయం. సొంత గడ్డపై న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్ తర్వాత భారత జట్టును బుమ్రా నడిపించిన తీరు అద్భుతం. అతడిని ఓడించలేరు. ఒకవేళ బుమ్రా వేలంలో ఉంటే.. ఏదైనా అద్భుతమే జరిగేది. వేలంలోకి వస్తే జట్లకు రూ.520 కోట్ల పర్స్ కూడా సరిపోదు’ అని ఆశిశ్ నెహ్రా చెప్పాడు. 2025 మెగా వేలానికి ముందు తొలి ప్రాధాన్య ఆటగాడిగా బుమ్రాను ముంబై రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!