తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని మరోసారి తేలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడేది కెసిఅర్ అని నిరూపితం అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల సోయి లేదని, కేఆర్ఎంబీ విషయాల్లో కాంగ్రెస్ ఎదురు దాడి చేసి… తప్పించుకునే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు కాంగ్రెస్…
విద్యుత్ విచారణ కమిషన్పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ కేసిఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీ ఆర్ ఎస్ పైన బురద జల్లె ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ది పై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల…
విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని, నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి…
Jagadish Reddy: 'ఖమ్మం-నల్గొండ-వరంగల్' పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుంది.. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని, 2 లేదా 3 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా.. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో మత…
Jagadesh Reddy: నా ఆస్తులపై చేస్తున్న ఆరోపణనలపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ)లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు జగదీష్ రెడ్డి. నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, 2014కు ముందు ఉన్న…
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారంనాడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. జిల్లాలోని తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి, సింగారంలో ఎండిపోయిన వరి పంటలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గాదరి కిషోర్తో కలిసి జగదీశ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం, కోనసీమలో ఎక్కడ చూసినా పచ్చని వ్యవసాయ పొలాలు, పచ్చని పచ్చిక బయళ్లే కనిపించాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ…
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. Prakash…
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్.. 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.