Jagadish Reddy : రైతు బంధు ఆపడానికి వీలు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్ఎస్ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు 2500 రూపాయల హామీ గురించి మాట్లాడం లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కమిటీలతో అవసరం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని, లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో దెబ్బతిన్నదని ఆయన అన్నారు. వీధి కుక్కలు జనం పై దాడి చేస్తున్నాయి …చైన్ స్నాచర్ల సంఖ్య పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా ఒక్క పనిని మొదలు పెట్టలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతోన్న విద్యుత్ కమీషన్ నుండి నాకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమీషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమీషన్కు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమీషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుండి కమీషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు.
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?