Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో ఇజ్రాయిల్ అంతటా హైఅలర్ట్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం కూడా ఇకపై సురక్షితంగా ఉండబోదని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సైనిక సలహాదారు జనరల్ రహీమ్ సఫావి హెచ్చరించారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయిల్ తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. ఎలాంటి ప్రతిస్పందనకైనా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఎవరైనా ఇజ్రాయిల్కి హాని చేయాలనుకున్నా, హాని చేసేందుకు ప్లాన్ చేసినా వారిని అంతమొందిస్తామని చెప్పారు.
Read Also: Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..
Also Read
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్తో పాటు 13 మంది మరణించారు. ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వివాదానికి అమెరికా దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. తమ స్థావరాలపై, తమ వారిపై దాడులు చేయొద్దని ఇరాన్ని అమెరికా కోరింది.
మరోవైపు గాజా యుద్ధంలో కీలక పరిణామం ఏర్పడింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ పోరులో దక్షిణ గాజా నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తమ బలగాలను ఉపసంహరించుకుంది. మరోవైపు రెండు పక్షాల మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, బందీల విడుదల చేస్తే తప్పితే, తాము కాల్పుల విరమణ ప్రకటించేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..