Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో ఇజ్రాయిల్ అంతటా హైఅలర్ట్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం కూడా ఇకపై సురక్షితంగా ఉండబోదని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సైనిక సలహాదారు జనరల్ రహీమ్ సఫావి హెచ్చరించారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయిల్ తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. ఎలాంటి ప్రతిస్పందనకైనా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఎవరైనా ఇజ్రాయిల్కి హాని చేయాలనుకున్నా, హాని చేసేందుకు ప్లాన్ చేసినా వారిని అంతమొందిస్తామని చెప్పారు.
Read Also: Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్తో పాటు 13 మంది మరణించారు. ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వివాదానికి అమెరికా దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. తమ స్థావరాలపై, తమ వారిపై దాడులు చేయొద్దని ఇరాన్ని అమెరికా కోరింది.
మరోవైపు గాజా యుద్ధంలో కీలక పరిణామం ఏర్పడింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ పోరులో దక్షిణ గాజా నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తమ బలగాలను ఉపసంహరించుకుంది. మరోవైపు రెండు పక్షాల మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, బందీల విడుదల చేస్తే తప్పితే, తాము కాల్పుల విరమణ ప్రకటించేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!