Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో ఇజ్రాయిల్ అంతటా హైఅలర్ట్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం కూడా ఇకపై సురక్షితంగా ఉండబోదని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సైనిక సలహాదారు జనరల్ రహీమ్ సఫావి హెచ్చరించారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయిల్ తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. ఎలాంటి ప్రతిస్పందనకైనా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఎవరైనా ఇజ్రాయిల్కి హాని చేయాలనుకున్నా, హాని చేసేందుకు ప్లాన్ చేసినా వారిని అంతమొందిస్తామని చెప్పారు.
Read Also: Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్తో పాటు 13 మంది మరణించారు. ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వివాదానికి అమెరికా దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. తమ స్థావరాలపై, తమ వారిపై దాడులు చేయొద్దని ఇరాన్ని అమెరికా కోరింది.
మరోవైపు గాజా యుద్ధంలో కీలక పరిణామం ఏర్పడింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ పోరులో దక్షిణ గాజా నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తమ బలగాలను ఉపసంహరించుకుంది. మరోవైపు రెండు పక్షాల మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, బందీల విడుదల చేస్తే తప్పితే, తాము కాల్పుల విరమణ ప్రకటించేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!