Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో ఇజ్రాయిల్ అంతటా హైఅలర్ట్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం కూడా ఇకపై సురక్షితంగా ఉండబోదని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సైనిక సలహాదారు జనరల్ రహీమ్ సఫావి హెచ్చరించారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయిల్ తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. ఎలాంటి ప్రతిస్పందనకైనా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఎవరైనా ఇజ్రాయిల్కి హాని చేయాలనుకున్నా, హాని చేసేందుకు ప్లాన్ చేసినా వారిని అంతమొందిస్తామని చెప్పారు.
Read Also: Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..
Also Read
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్తో పాటు 13 మంది మరణించారు. ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వివాదానికి అమెరికా దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. తమ స్థావరాలపై, తమ వారిపై దాడులు చేయొద్దని ఇరాన్ని అమెరికా కోరింది.
మరోవైపు గాజా యుద్ధంలో కీలక పరిణామం ఏర్పడింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ పోరులో దక్షిణ గాజా నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తమ బలగాలను ఉపసంహరించుకుంది. మరోవైపు రెండు పక్షాల మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, బందీల విడుదల చేస్తే తప్పితే, తాము కాల్పుల విరమణ ప్రకటించేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!