Israel: ఇజ్రాయెల్ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆయన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ బూనారు. దీనిపై దండెత్తేందుకు ఒక తేదీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. హమాస్కు బలమైన స్థావరంగా ఉన్న రఫాకు బలగాలను పంపిస్తామని గతంలోనే నెతన్యాహు అనేక మార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. అయితే నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రఫాకు బలగాలను పంపిస్తే.. అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 14 లక్షల మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్ చేయలేకపోయా: జగపతి బాబు
Also Read
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
2023, అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన గాజా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచిన తరుణంలో గాజా యుద్ధంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా ఎలాంటి సంధి ఉండబోదని నెతన్యాహు తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..
ఇక ఏప్రిల్ 1న గాజాలో జరిపిన వైమానిక దాడిలో యూఎస్ ఆధారిత ఫుడ్ ఛారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోవడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నెతన్యాహుకి బైడెన్ ఫోన్ చేసి.. తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. అయితే ఇజ్రాయెల్పై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని నెతన్యాహు ఆరోపణలు చేశారు. తమను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో.. వాళ్లను దెబ్బతీస్తామని పేర్కొన్నారు. ఈ సూత్రాన్ని తాము అన్ని సమయాల్లో ఆచరణలో పెట్టామని నెతన్యాహు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Janvikapoor : జాన్వీ కపూర్ వేసుకున్న ఈ డ్రెస్స్ ధర అన్ని లక్షలా?
తాజావార్తలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..