మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన యుద్ధం.. క్రమక్రమంగా తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయింది. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది.
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది.
దుబాయ్పై దాడులు (మార్చి 1, 2026 నాటికి) ఇరాన్ చేసిన ప్రతీకార దాడులు ఫలితంగా జరిగాయి. ఇవి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన భారీ దాడులకు ప్రతిస్పందనగా చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం. ఫిబ్రవరి 28, 2026 (శనివారం) న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ హత్యకు గురయ్యారు. ఇరాన్ స్టేట్ మీడియా ధృవీకరించింది. ట్రంప్, నెతన్యాహు దీనిని ధృవీకరించారు. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బ. ఖమేనీ మరణానికి ప్రతిస్పందనగా ఇరాన్…
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా.. మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్లపై దాడులు చేసింది.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరింత తీవ్రమైంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Israel: ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఓ వైపు కాల్పుల ఒప్పందం జరుగుతుంటే, మరోవైపు అనుమానిత ఉగ్రదాడులు ఇజ్రాయిల్ని కలవరపెడుతున్నాయి. గురువారం ఉత్తర ఇజ్రాయిల్లో పాదచారుల పైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీనిని పోలీసులు అనుమానిత ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు గాయపడ్డారు. Read Also: Mohammad Rizwan: జట్టు ప్రదర్శనపై ఎలాంటి సాకులు వెతకడం లేదు.. “ఇది ఉగ్రవాద దాడి అనే అనుమానం ఉంది. హైఫా నగరానికి దక్షిణంగా ఉన్న కర్కూర్ జంక్షన్ వద్ద…
ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి.
Israel Hezbullah Conflict : లెబనాన్ ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 45 కి పెరిగింది. గతంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల నుండి తప్పించుకున్న గ్రామీణ గ్రామాలపై కూడా వైమానిక దాడులు నిర్వహించింది.
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.