Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్కు పిలుపు.. ఇజ్రాయెల్ ఎటాక్పై యూఎన్లో చర్చ
- చైనా.. రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్కు పిలుపు
- ఇజ్రాయెల్ ఎటాక్పై యూఎన్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్షా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్.. మమతను గద్దె దింపేందుకు భారీ వ్యూహం?
Also Read
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. చైనా, రష్యా, అల్జీరియా మద్దతుతో ఐక్యరాజ్యసమితిలో ఎమర్జెన్సీ మీటింగ్కు ఇరాన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, భద్రతా మండలి అధ్యక్షుడికి శనివారం రాసిన లేఖ రాశారు. ఇజ్రాయెల్ దురాక్రమణల పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని.. నిర్ణయాత్మక వైఖరిని తీసుకోవాలని లేఖలో మంత్రి కోరారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని 15 మంది సభ్యుల భద్రతా మండలిని ఆయన కోరారు. ఈ మేరకు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్కు రష్యా, చైనా, అల్జీరియా మద్దతు తెలిపింది.
ఇది కూడా చదవండి: Census: 2025 నుంచి జనాభా లెక్కల సేకరణ.. డీలిమిటేషన్పై కేంద్రం సిద్ధం..
అక్టోబర్ 26(శనివారం)న ఖుజెస్తాన్, ఇలామ్, టెహ్రాన్ ప్రావిన్స్లోని అనే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాంతాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నలుగురు ఇరాన్ సైనికులు, ఒక పౌరుడు మరణించాడు.
అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్పై ఇరాన్ 180 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ గగనతలంలోనే పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాలను తాకాయి. పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ముందే హెచ్చరించినట్లుగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్పై దాడులకు తెగబడింది.
ఇది కూడా చదవండి: Lucky Baskhar: ప్రేక్షకులకు బోర్ కొట్టించొద్దు.. రిస్క్ అనే ఫీలింగే లేదు: మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!