Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్కు పిలుపు.. ఇజ్రాయెల్ ఎటాక్పై యూఎన్లో చర్చ
- చైనా.. రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్కు పిలుపు
- ఇజ్రాయెల్ ఎటాక్పై యూఎన్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్షా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్.. మమతను గద్దె దింపేందుకు భారీ వ్యూహం?
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. చైనా, రష్యా, అల్జీరియా మద్దతుతో ఐక్యరాజ్యసమితిలో ఎమర్జెన్సీ మీటింగ్కు ఇరాన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, భద్రతా మండలి అధ్యక్షుడికి శనివారం రాసిన లేఖ రాశారు. ఇజ్రాయెల్ దురాక్రమణల పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని.. నిర్ణయాత్మక వైఖరిని తీసుకోవాలని లేఖలో మంత్రి కోరారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని 15 మంది సభ్యుల భద్రతా మండలిని ఆయన కోరారు. ఈ మేరకు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్కు రష్యా, చైనా, అల్జీరియా మద్దతు తెలిపింది.
ఇది కూడా చదవండి: Census: 2025 నుంచి జనాభా లెక్కల సేకరణ.. డీలిమిటేషన్పై కేంద్రం సిద్ధం..
అక్టోబర్ 26(శనివారం)న ఖుజెస్తాన్, ఇలామ్, టెహ్రాన్ ప్రావిన్స్లోని అనే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాంతాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నలుగురు ఇరాన్ సైనికులు, ఒక పౌరుడు మరణించాడు.
అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్పై ఇరాన్ 180 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ గగనతలంలోనే పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాలను తాకాయి. పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ముందే హెచ్చరించినట్లుగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్పై దాడులకు తెగబడింది.
ఇది కూడా చదవండి: Lucky Baskhar: ప్రేక్షకులకు బోర్ కొట్టించొద్దు.. రిస్క్ అనే ఫీలింగే లేదు: మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!