ఐదు టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్లో ఐదవ, చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 272 పరుగుల లక్ష్యాన్ని…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్లో ఐదవ, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా సంజు సామ్సన్, అభిషేక్…
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు భారత బ్యాటర్లు చెలరేగుతుండడం సానుకూలాంశం. అయితే ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళనకరంగా మారింది. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది.…
టీ20 వరల్డ్కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్ల ముందు ఓ కీలక ప్రశ్న నిలిచింది. అదే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించేది ఎవరు?. సంజు శాంసన్?, ఇషాన్ కిషన్?, శుభ్మన్ గిల్?.. ఈ ముగ్గురిలో ఓపెనర్గా ఎవరు ఆడుతారు?. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఓపెనర్గా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గిల్ ఇప్పుడు…
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్లో సంజు శాంసన్ భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ సంజూ కెరీర్కు కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా మరోసారి విఫలమైతే.. జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంటే.. టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. మూడో టీ20లో సంజూ శాంసన్ విఫలమైతే.. నాలుగో టీ20 నుంచి…
నాగ్పుర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి వికెట్ అని, ఎక్కువ స్కోరింగ్ చేసేలా కనిపిస్తోందని సాంట్నర్ చెప్పాడు. భారత్కు వచ్చి గెలవడం ఎంత కష్టమో ప్రతి జట్టుకు తెలుసు అని, గత వారం చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. ఇది తాజా సిరీస్ అని, స్వదేశంలో టీమిండియా కఠినమైన జట్టు తెలిపాడు. ఈ సిరీస్…
భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్పూర్లో జరిగే ఈ మ్యాచ్లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో…
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్పూర్లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్…