Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
- ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఇషాన్ కిషన్
- 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్
- సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యం అని చెప్పుకొచ్చాడు.
అవార్డు సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘నిజాయితీగా చెప్పాలంటే ఆరంభంలో బంతి కాస్త స్వింగ్ అయింది. అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా సహాయపడింది. అభిషేక్ దూకుడు చూస్తే జట్టుకు ఏ మోమెంటం కావాలో స్పష్టంగా అర్థమవుతుంది. బంతిని జాగ్రత్తగా చూసి ఆడడమే నా పని. అదే ఈ రోజు నాకు కలిసొచ్చింది. జట్టంతా ఇప్పుడు ఒకే మైండ్సెట్లో ఉంది. మైలురాయి దగ్గర ఉన్నామని సింగిల్స్ తీసుకుంటూ ఆడితే.. తర్వాత పెద్ద షాట్లు కొట్టే అవకాశం కోల్పోయామనే భావన కలుగుతుంది. కాబట్టి బంతి కొట్టడానికి అనుకూలంగా ఉంటే.. ఎలాంటి భయం లేకుండా షాట్స్ ఆడాల్సిందే. జట్టు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం తప్ప.. వ్యక్తిగత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను’ అని చెప్పాడు.
Also Read
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
‘ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు. నేను ఇంకా పూర్తి స్థాయిలో ఆటలేదని భావిస్తున్నా. నేను బాగా ఆడాను, అవార్డు కూడా వచ్చింది కానీ.. నా దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్ 2026పైనే ఉంది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ను కొనసాగిస్తూ మెగా టోర్నీలో కూడా జట్టుకు ఉపయోగపడటమే ఇన్నింగ్స్ ఆడాలి. అదే నా అసలైన టార్గెట్. ప్రస్తుతం భారత జట్టు బాగుంది. అందురూ బాగా ఆడుతున్నారు. తప్పకుండా టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని ఇషాన్ కిషన్ ధీమా వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ విఫలమైన నేపథ్యంలో కిషన్ ఓపెనింగ్ చేయడం ఖాయం అయింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!