గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. "అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు.
Iran War: ఇరాన్పై దాడి చేయడానికి భారత్ ఓడరేవుల్ని అమెరికా వాడుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి ఊహాగానాలను భారత్ తిరస్కరించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్, ఇరాన్పై తన యుద్ధంలో అమెరికా భారత నావికా స్థావరాలను ఉపయోగించుకుంటోందని అన్నారు.
Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన…
Submarine attack: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, 78 మంది గాయపడినట్లు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలియజేసింది. శ్రీలంక జలాల్లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన నౌక నుంచి ప్రమాద హెచ్చరికలు రావడంతో శ్రీలంకన్ సైన్యం పెద్ద ఎత్తున సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. చాలా మంది తప్పిపోయినట్లు, గాయాలపాలైనట్లు శ్రీలంక సైన్యం…
Israel: ఇరాన్కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రం అవుతోంది. గత శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని యూఎస్, ఇజ్రాయిల్ చంపేశాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలను ఇరాన్ చేపట్టింది. ఖమేనీ వారసుడిగా ఆయన కొడుకు కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మద్దతు ఖమేనీ కుమారుడు మొజ్తాబాకు ఉంది.…
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది.
పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్న తరుణంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.