Trump: ఇరాన్కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనల్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
Iran War: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే నిర్వహించిన అమెరికా, ఇజ్రాయిల్లు ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధనౌక USS త్రిపోలిని రంగంలోకి దించింది. దీనికి తోడు 2500 మంది మెరైన్ కమాండోలను, F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ల ఇరాన్ వైపు పంపిస్తోంది. USS ట్రిపోలీ ప్రత్యేకతలు ఇవే: USS ట్రిపోలీ (LHA-7) ఒక పెద్ద ఉభయచర…
Kim jong un: గత 15 రోజులుగా మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్లు దాడులు చేస్తు్న్నాయి. ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై దాడులు నిర్వహిస్తోంది. ఇదే కాకుండా గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్లోని ఆయిల్, గ్యాస్ సంస్థలపై దాడులు చేస్తోంది.
US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.
LPG Crisis: భారత్కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న వేళ, ఉపశనం కలిగించే వార్త వెలువడింది. ముఖ్యంగా వంటగ్యాస్(LPG)కోసం దేశంలోని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి సమయంలో ఇరాన్తో భారత్ ఒప్పందాన్ని కదుర్చుకుంది. హార్ముజ్ జలసంధి మీదుగా రెండు LPG ట్యాంకర్లు భారత్ బయలుదేరాయి. ప్రస్తుతం వంటగ్యాస్ కొరతతో సతమతం అవతున్న భారత్కు ఇది పెద్ద ఊరట.
Iran War: పర్షియన్ గల్ఫ్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్కు సానుకూల వార్త వెలువడింది. భారత్లోని ఇరాన్ రాయబారిక మొహమ్మద్ ఫతాలి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి సురక్షితమైన ప్రయాణాన్ని మంజూరు చేయవచ్చని సంకేతాలిచ్చారు.
Iran War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా.? అంటే అందుకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యే ఉండకుండా మిడిల్ ఈస్ట్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
Mohammad Ali Jafari: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ ప్రారంభమైన తొలిరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దృఢంగానే ఉంది. ఈ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన ప్రతీకారం తీర్చుకుంటోంది. మరోవైపు.. ఇరాన్, యూఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’అని ట్రంప్ G7 దేశాల నాయకులతో అన్నారు. ట్రంప్ తన ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’పై గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పట్టిన క్యాన్సర్ను వదిలిస్తాన్నామని మిత్రదేశాలతో ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించి, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా…