దేశీయ మార్కెట్కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది.
అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది.
Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఖతార్ LNG ఎగుమతులను 40 శాతం వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. Read Also: T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా.. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.…
India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో…
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం చేసింది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై లెబనాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులు చేస్తున్నాయి.
ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదన్నారు.