Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇది ఆ యుద్ధంతో సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు, కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలో నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 31 ఏళ్ల కోల్ టోమాస్ అలెన్ అనే వ్యక్తి ఒంటరిగా దాడికి పాల్పడినట్లు సమాచారం. అతను పలు ఆయుధాలతో భద్రతా చెక్పాయింట్ వైపు దూసుకెళ్లి కాల్పులు జరిపాడని ట్రంప్ తెలిపారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సీక్రెట్ సర్వీస్ అధికారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
Also Read
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
ఈ ఘటనతో డిన్నర్ కార్యక్రమం రద్దు చేయబడింది. అయితే భద్రతా వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయని ట్రంప్ ప్రశంసించారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు నిందితుడి ఉద్దేశ్యంపై విచారణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇక మరోవైపు ఇరాన్తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల పర్యటనను ట్రంప్ రద్దు చేశారు. చర్చలు ఫలప్రదంగా లేవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “మనం బలమైన స్థితిలో ఉన్నాం. వాళ్లు మాట్లాడాలంటే వాళ్లే ముందుకు రావాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ దేశంలో అంతర్గత గందరగోళం ఉందని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!