ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7: 30 గంటలకు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సృష్టించనున్నాడు.
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠంగా జరిగే అవకాశం ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ ( 2022 ) నుంచి పేలవమైన ప్రదర్శనతో చిరాకు తెప్పించే ఆట ఆడుతున్నాడు పరాగ్. గుజరాత్ ( మే 5 ) తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిపోయాడు. ఈ సీజన్లో అతను ఆడిన ఆరు మ్యాచ్లు ఒక్క…
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమింయాకి విరాట్ కోహ్లీ కీలకమైన బ్యాటర్. అతను ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ కీలకమైన ఆటగాడిగా ఉండబోతున్నాడు. ఇప్పటికే బీఐసీసీ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కక్షకట్టి, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించాడని మాజీ చీఫ్ సెలక్షర్ చేతన్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్యూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్ 5 పరుగుల తేడాతో ఎస్ ఆర్ హెచ్ పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కోల్ కతా జట్టు యాజమాన్యం అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.