ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియం గార్గ్ (4) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు. అతడు 43 పరుగులు చేశాడు. Team India: కెప్టెన్గా కేఎల్…
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగిసిపోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ప్లే ఆఫ్స్లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ నెల 24న గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో…
ఐపీఎల్ పుణ్యమా అని, ఎందరో యువ ఆటగాళ్ళ ప్రతిభ బయటపడింది. ఒక్క అవకాశం అంటూ కలలు కన్న ఎందరో ప్లేయర్స్కి.. ఈ టీ20 లీగ్ ఒక అద్భుత వరంలా మారింది. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్స్లో చాలామంది యంగ్స్టర్స్ తమ సత్తా చాటి.. అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాలో చోటు దక్కిందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. క్రీడాభిమానుల గుండుల్లో మాత్రం తమదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్గా అలాంటి ఆటగాళ్ళ జాబితాలోకి తెలుగుతేజం నంబూరి తిలక్…
అది 2018.. ఆ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్లో బెర్తు కన్ఫమ్ చేసుకోవాలంటే, ఆ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఆశల్ని నీరుగార్చింది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ, ముంబైను ప్లేఆఫ్స్కు వెళ్ళకుండా అడ్డుకుంది. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఆ ప్రతీకారాన్ని ముంబై తీర్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ను ముంబై సొంతం చేసుకొని, ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశల్ని గల్లంతు చేసింది. ఈసారి ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో…
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5), ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (0) త్వరత్వరగా ఔట్ కావడంతో 22 పరుగులకే రెండు వికెట్లు…
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్ నాలుగో బెర్తును ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కథ ముగుస్తుంది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు…
కామెంటరీలో తమ ప్రత్యేకత చాటుకోవాలని.. పంచ్లు, ప్రాసలతో ఆకట్టుకోవాలన్న మోజులో కొందరు దిగ్గజాలు హద్దు మీరుతున్నారు. క్రికెట్పై తమకున్న అనుభవాన్ని రంగరించి, వాక్చాతుర్యంతో రక్తి కట్టించాల్సిన వీళ్ళు.. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకరు. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కామెంట్ చేయబోయి, అతని భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు మరోసారి హెట్మెయర్,…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందు నుంచే, ఇదే మహేంద్ర సింగ్ ధోనీది చివరి ఐపీఎల్ లీగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఇక సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ఆ ప్రచారం నిజమేనని అంతా అనుకున్నారు. ఈ టోర్నీ సగంలో మళ్ళీ చెన్నై పగ్గాల్ని ధోనీ అందుకున్నప్పటికీ.. అతనిపై భవిష్యత్తుపైనే సరైన స్పష్టత రాలేదు. వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి…
నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్రేట్తో…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే మిగతా ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చాహల్, ఒబెడ్ మెకాయ్ రెండేసి వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్…