ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగిసిపోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ప్లే ఆఫ్స్లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ నెల 24న గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
లక్నో, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్లిపోతుంది. గెలిచిన జట్టు మాత్రం ఫైనల్కు వెళ్లాలంటే రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఫైనల్కు చేరాలంటే ఇంత తతంగం ఉంది. అయితే జ్యోతిష్యులు మాత్రం ఫైనల్ మ్యాచ్పై తమ అంచనాలను సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఫైనల్కు చేరుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్తోనే ఐపీఎల్లోకి అడుగుపెట్టిన గుజరాత్, లక్నో జట్లు ఫైనల్ చేరే అర్హత సాధించలేవని తేల్చి చెప్తున్నారు. మరి జ్యోతిష్యుల మాట నిజం అవుతుందో లేదో చూడాలంటే మరో వారం రోజులు ఓపిక పడితే సరిపోతుంది.