ఎంత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్కున్న క్రేజ్ 15 ఏళ్లలో ఏమాత్రం తగ్గలేదన్నది క్రీడానిపుణులు ఉవాచ. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లో టైటిల్ కొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ సేన కప్ కొట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని…
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు…
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్డిక్ పాండ్యాను ఔట్ చేసి 27వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పర్పుల్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు తాహిర్ రికార్డును బ్రేక్ చేసి తొలి స్థానానికి…
ఈ సీజన్ ఐపీఎల్లో కొత్త ఛాంపియన్గా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే కప్పు అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ విధించిన 131 పరుగుల టార్గెట్ను సులభంగా ఛేదించింది. శుభ్మన్ గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34), మిల్లర్ (32 నాటౌట్) రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలుపొందింది. రాజస్థాన్…
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ముందు రాజస్థాన్ తేలిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ కుప్పకూలింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ 39, జైశ్వాల్ 22 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, సాయి…
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు ముగిసిన సందర్భంగా బీసీసీఐ 10 జట్ల లోగోలతో కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద జెర్సీని రూపొందించింది. దీంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ను అందజేశారు. IPL 2022: ఐపీఎల్ విన్నర్కు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది?…
ఐపీఎల్ 2022 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్ల వివరాలు: రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్,…