ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండగా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే…
స్మార్ట్ ప్రపంచంలో అన్ని స్మార్ట్గా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా సరే మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా మొత్తం టైప్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ శ్రమ అక్కర్లేకుండా మన ఫీలింగ్స్ని ఎమోజీల రూపంలో పెట్టేస్తున్నారు. 2021లో నెటిజన్లు ఎలాంటి ఎమోజీలను ఎక్కువడా యూజ్ చేశారు అనే దానిపై యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ సర్వేను నిర్వహించి డేటాను విడుదల చేసింది. Read: ఆనంద్ మహీంద్రా ఆటోపై జోహో సీఈవో ట్వీట్……
అమెరికా అంటే అభివృద్ది చెందిన టెక్నాలజీ, భారీ కట్టడాలు, పబ్ కల్చర్, ఫాస్ట్ లైఫ్. అన్నింటికీ మించి అధికమొత్తంలో శాలరీలు. అందుకే ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలని అనుకుంటారు. అటువంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో అభివృద్ధికి దూరంగా, టెక్నాలజీ లేకుండా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సౌకర్యాలు లేకుండా ఉన్న గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామం పేరు సుపాయ్. ఈ గ్రామం గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయల్లో ఉన్నది. ఈ…
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్ను తీసుకొస్తూ వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే పేమెంట్ గేట్వే ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ను వినియోగించుకునే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వెబ్ యాప్ ద్వానా ఒక సిస్టమ్కు కనెక్ట్ అయినపును, మొబైల్లో ఇంటర్నెట్ లేకుంటే వెబ్ యాప్ కూడా ఆగిపోతుంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం మొబైల్లో ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ను వెబ్ యాప్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.…
సూడాన్ అతలాకుతలం అవుతున్నది. అసలే పేదరికం. మరోవైపు కరోనా భయం. నిరుద్యోగంలో సూడాన్ ఇబ్బందులు పడుతున్నది. అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు కారణంగా ఆ దేశం అభివృద్ధి చెందలేకపోతున్నది. ఇక ఇదిలా ఉంటే, సూడాన్ రాజధాని ఖార్టోమ్లో ప్రధాని అబ్దాల హ్యాండాక్ ను సైన్యం అరెస్ట్ చేసింది. దీంతో రాజధానిలో ఒక్కసారిగా అలజడి రేగింది. దేశంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, విషయాల బయటకు పొక్కకుండా ఉండేందుకు, దేశంలో పెద్ద ఎత్తున అలజడులు జరగకుండా…
మొన్నటి రోజున ఫేస్బుక్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటలపాటు ఫేస్బుక్కు అంతరాయం కలిగింది. ఏడు గంటల అంతరాయంతో 7 బిలియిన్ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గత కొన్ని గంటలుగా జియో నెట్ వర్క్లో సమస్యలు వస్తున్నాయి. జియోనెట్ లో సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. జియోనెట్డౌన్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నెట్ వర్క్ సమస్యలు తాత్కాలికమే అని, సమస్యలు…
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 15 వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగంగా నిర్వహించుకుంటుంటే, మేఘాలయ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అలజడులు జరిగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఆందోళనలు జరిగాయి. నేషనల్ లిబరేషనల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్కీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. ఇటీవలే లైతుంఖ్రా వద్ద జరిగిన బాంబు దాడుల్లో థాంగ్కీ హస్తం ఉందనే అనుమానాలు కలగడంతో ఆయన్న…
ఇండియాలోనే అతిపెద్ద ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్వర్క్ గా హైదరాబాద్ ఉంది. లార్జెస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. హై ఫై ప్రోగ్రాంలో భాగంగా ఆక్ట్ ఫైబర్ నెట్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఫ్రీ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హై ఫై ప్రోగ్రాం కామెమోరేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, IT ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆక్ట్ ఫైబర్ నెట్ సీఈఓ బాల మల్లాది, GHMC మేయర్ విజయలక్ష్మి…
ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించడం కష్టమే. చదువున్నా లేకపోయినా ఇంటర్నెట్ మాత్రం కావాలి. లేదంటే ప్రపంచం ముందుకు కదలని పరిస్థితి. ఒకప్పుడు ఇంటర్నెట్ అత్యంత ఖరీదైన వ్యవహారం. కానీ, ఇప్పుడు అదే ఇంటర్నెట్ అత్యంత చౌకగా దొరుకుతున్నది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఫ్రీ వైఫై అందిస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫై అందిస్తుంటారు. కేవలం రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వైఫై అందించేందుకు యూపీ సర్కార్…