ఒక వ్యక్తి ప్రపంచ రికార్డు కోసం వింతగా ఆలోచించాడు. కన్నీరు కార్చి రికార్డు సాధిస్తానని వారం మొత్తం నాన్స్టాప్గా ఏడవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి కంటిన్యూగా ఏడవడంతో.. తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయాడు.
ప్రపంచంలో ఒకచోట ఎడతెరిపి లేని వర్షాలు.. మరొక చోట అగ్ని వర్షం కురుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తో లక్షలాది మంది ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. యూరప్, జపాన్లో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. క్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వర్ష బీభత్సంతో డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ…
అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
హాట్పాట్ రెస్టారెంట్గా పిలవబడే పిపా యువాన్ రెస్టారెంట్.. చైనాలోని చాంగ్క్వింగ్ నగర సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో పదో, పాతికో మంది కాదు.. ఏకంగా ఒకేసారి 5 వేల 800 మంది భోజనం చేసేయొచ్చు.
ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్నట్లు మరియు బాదం పప్పులు ఉన్నాయి.
భారత్ ఇప్పుడిప్పుడే వివిధ వ్యాపార రంగాల్లో చైనాకు సవాల్ విసురుతోంది. మొదట స్మార్ట్ఫోన్ల విషయంలో యాపిల్ వంటి కంపెనీ భారతదేశానికి రావడం.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సెమీకండక్టర్ తయారీకి మిర్కాన్ అంగీకరించడం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశానికి రావడానికి అంగీకరించారు. ఈ విధంగా చైనా వ్యాపారాన్ని భారతదేశం సెలెక్టివ్గా సవాలు చేస్తోంది. ఇప్పుడు చైనా భారత్చే 'లాండరింగ్'గా భావిస్తున్న మరో రంగం కూడా…
2022లో ఇంగ్లండ్లో సిక్కు ట్యాక్సీ డ్రైవర్కు చెల్లింపుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్లో జరిగిన ఈ హత్యకేసు నిందితుడికి శిక్ష పడింది. టాక్సీ డ్రైవర్ పేరు అంఖ్ సింగ్ (59). టోమాజ్ మార్గోల్ (36) అనే వ్యక్తి హత్య చేసి దోషిగా నిర్ధారించబడ్డాడు. సింగ్ హత్యకు సంబంధించి అతను ఈ వారం వోల్వర్హాంప్టన్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఈజిప్ట్కు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఈజిప్ట్ ప్రధాని వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కలుసుకున్నారు.
Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా…