Good News: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Read Also: Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ..
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
ఈ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో జరగబోయేది మూడో మ్యాచ్ అని.. గత మ్యాచ్ లలో చోటు చేసుకున్న లోటు బాట్లుపై చర్చించామని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్ లను,సెక్రెటరీలకు ఆహ్వానం ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో 27 వేల మంది కూర్చునే కెపాసిటీ ఉందని అన్నారు. అంతేకాకుండా.. విశాఖ బీచ్ రోడ్డులో 10 వేల మంది వీక్షించేందుకు ఐపీఎల్ తరహా ఫ్యాన్ పార్క్స్, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Read Also: Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత
జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్లేయర్స్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ పై అందరి ఎక్సపెటేషన్స్ రీచ్ అయ్యేలా గ్రాండ్ ఎరేంజ్మెంట్స్ చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ డే రోజు పార్కింగ్, ట్రాఫిక్ లపై పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని సీపీ రవి శంకర్ అయ్యర్ అన్నారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత నడుమ నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 2 వేల మంది వరకు విధుల్లో పాల్గొంటామన్నారు.
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!