కరోనా మళ్లీ భయపెడుతోంది.దేశంలో పాజిటివ్ కేసులు ప్రకంపం సృష్టిస్తున్నాయి.ఊహించిన దానికి కంటే వైరస్ వేగంగా విస్తరిస్తోంది.చూస్తుండగానే తెలుగురాష్ట్రాల్లోకి ఎంటరైంది.ఏపీలో కడప,విశాఖను తెలంగాణలో కూకట్పల్లిని టచ్ చేసింది.కరోనాకు పెద్దగా భయపడాల్సింది లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.మరి లైట్ తీసుకుంటే లైఫ్లో రిస్క్లో పడినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు.
Spy Jyoti Malhotra: పాకిస్తాన్కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా వాటిని ఆ డైరీలో రాస్తుంటుంది.
Turkey: పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది.